- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు గుడ్ న్యూస్.. 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది.

దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లను (Free gas connections) మంజూరు చేసింది. ఈ కొత్త అడిషనల్ కనెక్షన్లతో, ప్రతి లబ్ధిదారులకు సిలిండర్, రెగ్యులేటర్, సురక్షా హోస్, డొమెస్టిక్ గ్యాస్ కన్స్యూమర్ కార్డు, ఇన్స్టాలేషన్ ఛార్జీలు, మొదటి రిఫిల్ ఉచితంగా అందించబడుతుంది. మొత్తం ప్రాజెక్టు కోసం సుమారు 676 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో 512.5 కోట్ల రూపాయలు 25 లక్షల డిపాజిట్-రహిత కనెక్షన్ల కోసం, 160 కోట్ల రూపాయలు గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ, మిగిలిన 3.5 కోట్ల రూపాయలు నిర్వహణ ఖర్చులకు కేటాయించబడ్డాయి.
ఈ యోజనలో ప్రధానంగా పేద కుటుంబాల మహిళలు అర్హులు, వారు ఆన్లైన్ లేదా పబ్లిక్ సెక్టార్ OMC డిస్ట్రిబ్యూటర్ వద్ద సరళీకృత KYC ఫారం, డిక్లరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2016 లో ప్రారంభమైన PMUY ఇప్పటి వరకు కోట్లాది మహిళలకు లబ్ధాలు అందించగా, ఉజ్వల 2.0 ద్వారా లక్ష్యాలను మరింత విస్తరించింది. ఈ యోజన మహిళల ఆరోగ్యం, కుటుంబాల ఆర్థిక పరిస్థితి, సమయం ఆదా కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తూ.. మహిళల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు స్పష్టం అవుతోంది.






