పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలంగాణలో ఇద్దరికి పద్మశ్రీ

by Disha Web Desk 2 |
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలంగాణలో ఇద్దరికి పద్మశ్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్పకు, జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యలకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరికి పద్మశ్రీ ప్రకటించింది. మొత్తం దేశ వ్యాప్తంగా 34 మంది పద్మ, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. కాగా, అంతరించిపోతున్న కళలను కాపాడటమే లక్ష్యంగా వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించడంపై సదరు కళాకారుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.



Next Story

Most Viewed