కర్నాటకలో కాలువలో పడ్డ బస్సు

by Muthe.Rajitha |

కర్నాటక(Karnataka)లో ఓ ప్రయివేట్ బస్సు(Bus Accident) కాలువలో పడిన దుర్ఘటన చోటు చేసుకుంది.

కర్నాటకలో కాలువలో పడ్డ బస్సు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నాటక(Karnataka)లో ఓ ప్రయివేట్ బస్సు(Bus Accident) కాలువలో పడిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఐ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటకలోని ఉತ್ತర కన్నడ జిల్లాలో జాతీయ రహదారి 63 (NH-63)పై అగసూరు వద్ద ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సుబ్రిడ్జి మీది నుంచి కాలువలో పడింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. ఈ బస్సు గోవా నుండి హైదరాబాద్‌కు 29 మంది ప్రయాణికులతో బయలుదేరింది. చీకటిలో రహదారిపై ఉన్న వంపును డ్రైవర్ సరిగా అంచనా వేయకపోవడం వల్ల బస్సు నియంత్రణ కోల్పోయి బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

గాయపడిన 18 మందిని సమీపంలోని కుమతా, కార్వార్ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. బస్సును క్రేన్ సహాయంతో కాలువ నుండి బయటకు తీశారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. గాయపడినవారి పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story