ఔరంగాబాద్‌లో BRS సభాస్థలి ఖరారు

by Disha Web Desk 2 |
ఔరంగాబాద్‌లో BRS సభాస్థలి ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ సభాస్థలి ఫిక్స్ అయింది. జబిందా మైదానంలో నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు. గురువారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్‌లో ప్రచార రథాలతో పాటు సభ వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేయడానికి ప్రచారరథాలను ప్రారంభించామన్నారు. ఈనెల 24న జబిందాలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతానికి పెద్ద ఎత్తున చేస్తున్న ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అధిక సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed