BREAKING: రాహుల్‌గాంధీ పోటీ చేసే స్థానంపై వీడిన సస్పెన్స్.. మళ్లీ అక్కడి నుంచే పోటీ

by Disha Web Desk 1 |
BREAKING: రాహుల్‌గాంధీ పోటీ చేసే స్థానంపై వీడిన సస్పెన్స్.. మళ్లీ అక్కడి నుంచే పోటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. ఆయన మళ్లీ మరోసారి కేరళలోని వయనాడ్ నుంచే పోటీ ఉండబోతున్నారు. ఈ మేరకు ఢిల్లీలో నేడు జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాహుల్‌ 2019లో తొలిసారి వయనాడ్‌ నుంచి పోటీ చేశారు. 4 లక్షల ఓట్ల మెజార్టీతో సీపీఐ అభ్యర్థిపై విజయం సాధించారు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట అమేఠీ నుంచి బరిలోకి దిగినప్పటికీ.. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఆయన పోటీ చేసే స్థానాలపై ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story

Most Viewed