బ్రేకింగ్ : బీహార్ రాజకీయాల్లో బోణి కొట్టిన ప్రశాంత్ కిషోర్ పార్టీ

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : బీహార్ రాజకీయాల్లో బోణి కొట్టిన ప్రశాంత్ కిషోర్ పార్టీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో బోణీ కొట్టింది. బీహార్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీకే పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. గత ఏడాది జన్ పీకే సురాజ్ పార్టీని స్థాపించారు. అక్టోబర్ 2న ఆయన జన్ సురాజ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. గురువారం నాటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి అఫాక్ అహ్మద్ విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో సాధించిన తొలి విజయం ఇదే కావడం విశేషం. ఈ విజయంతో బీహార్ శాసనమండలిలో ప్రశాంత్ కిషోర్ పార్టీకి ప్రాతినిధ్యం దక్కినట్లయ్యింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని ఐదు జిల్లాల ఓటర్లు ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.



Next Story

Most Viewed