J&K News : జమ్మూ కాశ్మీర్ లో పేలుళ్లు... ఆరుగురు జవాన్లకు గాయాలు

by M.Rajitha |
J&K News : జమ్మూ కాశ్మీర్ లో పేలుళ్లు... ఆరుగురు జవాన్లకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్లో(Jammu Kashmir) మరోసారి పేలుళ్లు(Blasts) సంభవించాయి. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పేలుళ్లు జరిగాయి. రాజౌరీ(Rajouri)లోని నౌషెరా సెక్టార్లో ల్యాండ్ మైన్ పేలగా.. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. హుటాహుటిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తునారు. కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎల్వోసీ వద్ద గోర్ఖా రైఫిల్స్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed