- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kerala: కేరళ రాజకీయాల్లో కొత్త మార్పులు
రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి నేమం, కాళక్కూట్టం, చాతన్నూర్ అనే మూడు కీలక స్థానాల్లో విజయం కేరళంలో నెమ్మదిగా పెరుగుతున్న బీజేపీ ప్రభావానికి సంకేతం.

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ, బీజేపీ మూడు స్థానాల్లో గెలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి నేమం, కాళక్కూట్టం, చాతన్నూర్ అనే మూడు కీలక స్థానాల్లో విజయం కేరళంలో నెమ్మదిగా పెరుగుతున్న బీజేపీ ప్రభావానికి సంకేతం. మొత్తం ఫలితాల్లో భారీ విజయాలను సాధించకపోయినా మూడు సీట్లు చెప్పుకోదగ్గవి. తిరువనంతపురం ప్రాంతంలో బీజేపీకి కీలకంగా భావించే నేమం నియోజకవర్గంలో, సీనియర్ నేత రాజీవ్ చంద్రశేఖర్ విజయం సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. ఆయన వి శివన్కుట్టిపై 3,590 ఓట్ల తేడాతో గెలిచారు. ఇదే స్థానంలో కాంగ్రెస్కు చెందిన కె ఎస్ శబరినాథన్ మూడో స్థానంలో నిలిచారు. ఇక కాళక్కూట్టంలో మాజీ కేంద్ర మంత్రి వి మురళీధరన్ విజయం సాధించడం ద్వారా, తిరువనంతపురం అర్బన్ బెల్ట్లో బీజేపీ తన పట్టు పెంచుకుంటోందనే సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో చాతన్నూర్లో హోరాహోరీ పోరులో బి బి గోపాకుమార్ గెలవడం పార్టీకి మరో కీలక బలం చేకూర్చింది. మొత్తంగా చూస్తే, అధికారంలోకి రాకపోయినా, ఈ మూడు విజయాలు కేరళలో బీజేపీ భవిష్యత్తు వ్యూహాలకు ఒక బలమైన పునాది వేసినట్లు భావించవచ్చు. ముఖ్యంగా అర్బన్, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో పార్టీ తన ప్రభావాన్ని క్రమంగా విస్తరిస్తోందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.






