తల నరికేసుకుంటానుగానీ.. బీజేపీలో చేరను: డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
తల నరికేసుకుంటానుగానీ.. బీజేపీలో చేరను: డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేంద్ర బీజేపీ సర్కార్‌పై ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ(ఆప్) పార్టీని విచ్చిన్నం చేసి బీజేపీలో చేరితే.. సీబీఐ, ఈడీ కేసులు అన్ని మూసేస్తామని తనకు బీజేపీ నుండి ఒక మెసేజ్ వచ్చిందని తెలిపారు. ''నేను ఒక రాజ్ పుత్‌ని, మహారాణా ప్రతాప్ వంశస్థుడిని. నా తల నరికేసుకుంటాను కానీ.. అవినీతి, కుట్రదారుల ముందు తలవంచను'' అని సిసోడియా ఆ మెసేజ్‌కు కౌంటర్ ఇచ్చారు.

ఇక, దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో మనీష్ సిసోడియాను సీబీఐ నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కాం జరిగిందని.. ఇందులో మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడ్డాని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Next Story

Most Viewed