ఎల్లుండి తమిళనాడు సీఎం స్టాలిన్ తో బీహార్ సీఎం నితీశ్ భేటీ

by Dishafeatures2 |
ఎల్లుండి తమిళనాడు సీఎం స్టాలిన్ తో బీహార్ సీఎం నితీశ్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 20న తమిళనాడులో ఆ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడి సీఎం ఎంకే స్టాలిన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ నెల 23న బీహార్ లోని పాట్నాలో విపక్షాల మీటింగ్ జరగనున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ తమిళనాడు సీఎంతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. విపక్షాల మీటింగ్ కు రావాలని స్టాలిన్ ను ఆహ్వానించడానికే నితీశ్ కుమార్ తమిళనాడు వెళ్లనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను, సీఎంలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటివరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులతో భేటీ అయ్యారు. తాజాగా ఎల్లుండి ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్ తో కూడా భేటీ కానుండటం అందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed