TTD: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమిపూజ

by Disha Web Desk 16 |
TTD: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమిపూజ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని నవీ ముంబయిలో బుధవారం శ్రీవారి ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం సీఎం ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ... తిరుమల తరహాలో నవీ ముంబయిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ ముందుకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని వెల్లడించారు. తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు ఈ ఆలయంలో దర్శన భాగ్యం కలుగుతుందని స్పష్టం చేశారు.


టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించడం సంతోషకరమన్నారు. రెండేళ్లలో తిరుమల ఆలయం తరహాలోనే ఇక్కడా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.


Next Story