ముంబై విమానాశ్రయంలో రూ. 6.2 కోట్ల విలువైన 10 కిలోల బంగారం స్వాధీనం

by Disha Web Desk 1 |
ముంబై విమానాశ్రయంలో రూ. 6.2 కోట్ల విలువైన 10 కిలోల బంగారం స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు వేర్వేరు కేసుల్లో సుమారు రూ. 6.2 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని ముంబై విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ దాడుల్లో నలుగురు ప్రయాణికులను అరెస్టు చేశారు. ప్రత్యేక నిఘా ఆధారంగా మొదటి కేసులో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ నంబర్ IX 252లో షార్జా నుంచి ముంబైకి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అడ్డుకున్నారు. రెండో కేసులో జూన్ 3న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వస్తున్న ఓ భారతీయుడిని కూడా అడ్డుకుని సోదాలు చేశారు. రికవరీ చేసిన బంగారు తీగలు నికర బరువు 2005 గ్రాములు, తాత్కాలిక విలువ రూ.1,23,80,875 రూపాయలు. మొత్తం రెండు దాడుల్లో కలిపి రూ.6.2 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులలో మొత్తం నలుగురు ప్రయాణికులను అరెస్టు చేశారు.


Next Story

Most Viewed