జోడోయాత్రను మీడియా బాయ్‌కాట్ చేస్తోంది

by Disha Web Desk 7 |
జోడోయాత్రను మీడియా బాయ్‌కాట్ చేస్తోంది
X

జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్రను మీడియా బాయ్‌కాట్ చేస్తుందని సోమవారం ఆరోపించారు. 'యాత్రను మీడియా బాయ్‌కాట్ చేసిందని నేను ఆరోపిస్తున్నాను. లక్షల మంది యాత్రలో భాగమైతున్నారు. ఇలాంటి పెద్ద యాత్రను మీరు ఎప్పుడు చూసి ఉండరు' అని పేర్కొన్నారు. ఈ యాత్రను చూపించడం మీడియా కర్తవ్యమని అన్నారు. రాహుల్ గాంధీ సానూకూల ఆలోచనలతో ఎలాంటి హింస లేదని పేర్కొన్నారు. ఇలాంటి యాత్రను చూపించకపోతే దేశ కర్తవ్యాన్ని నేరవేర్చడంలో మీరు విఫలమైనట్లేనని మీడియాను ఉద్దేశించి చెప్పారు. చరిత్ర మీడియాను మరిచిపోదని, యాత్రను అపసహ్యం చేశారని వాదించారు. కాగా, జోడోయాత్ర రాజస్థాన్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.


Also Read......

మోడీ మీటింగ్‌కు మరోసారి కేసీఆర్ దూరం?



Next Story

Most Viewed