ఆశా వర్కర్ రేప్ అండ్ మర్డర్.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని ఖమాపూర్ గ్రామానికి చెందిన 43 ఏళ్ల ఆశా వర్కర్ అంజలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించబడింది. ఆమె అర్ధ నగ్నంగా ఉన్న మృతదేహం బరౌట్ ప్రాంతంలోని కోటానా రోడ్డులోని భవనంలో సంచిలో ప్యాక్ చేసి ఉంది

ఆశా వర్కర్ రేప్ అండ్ మర్డర్.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని ఖమాపూర్ గ్రామానికి చెందిన 43 ఏళ్ల ఆశా వర్కర్ అంజలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించబడింది. ఆమె అర్ధ నగ్నంగా ఉన్న మృతదేహం బరౌట్ ప్రాంతంలోని కోటానా రోడ్డులోని భవనంలో సంచిలో ప్యాక్ చేసి ఉంది. నిందితుడు అంజలి భర్త చశ్మవీర్ బంధువైన 44 ఏళ్ల భూపేంద్రపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు

ఆశా వర్కర్ అంజలి శరీరంపై తలకు గాయాలు ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ఆమె మరణానికి కారణమైంది. కుటుంబం ఆమె హత్యకు ముందు అత్యాచారం జరిగిందని ఆరోపించింది. అయితే ఈ విషయంపై పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉంది. అంతేకాక ₹4000 లావాదేవీపై వివాదం కారణంగా ఈ హత్య జరిగిందని కుటుంబం పేర్కొంది.

Next Story