మరో ముగ్గురికి నోబెల్ పురస్కారాలు

by Naga Rani Yarlagadda |

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు నోబెల్ పురస్కారాల ప్రకటనలు కొనసాగుతున్నాయి.

మరో ముగ్గురికి నోబెల్ పురస్కారాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు నోబెల్ పురస్కారాల ప్రకటనలు కొనసాగుతున్నాయి. తాజాగా రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. సుసుము కిటగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం.యాఘిలకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైనెన్స్ ఈ అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ లో జరిపిన పరిశోధనలకు గుర్తింపుగా అ పురస్కారం దక్కింది. గతేడాది కూడా రసాయనశాస్త్రంలో ముగ్గురు నోబెల్ బహుమతిని పొందారు. డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్ లు గతేడాది ప్రొటీన్లపై జరిపిన పరిశోధనలకు నోబెల్ బహుమతిని అందుకున్నారు. కాగా.. ఈనెల 13వ తేదీ వరకూ నోబెల్ బహుమతుల ప్రకటన కొనసాగనుంది.

Next Story