బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత..

by Disha Web Desk 13 |
బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత..
X

చండీగఢ్: మాజీ కేంద్ర మంత్రి, హర్యానాలోని అంబాలాకు చెందిన బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా (71) కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో నెల రోజుల క్రితం చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్‌లో చేరారు. అప్పటి నుంచి అందులోనే న్యుమోనియా చికిత్సపొందుతున్న కటారియా గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రత్తన్ లాల్ కటారియాకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

ఆయన మృతి పట్ల హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ హర్యానా చీఫ్ ఓం ప్రకాష్ ధంకర్ సహా బీజేపీ సీనియర్ నేతలు సంతాపం తెలిపారు. ‘కేంద్ర మాజీ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా మరణ వార్త తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను’ అని సీఎం ఖట్టర్‌ ట్వీట్‌ చేశారు. రతన్ లాల్ కటారియాకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది.



Next Story

Most Viewed