అమర్‌నాథ్ భక్తులకు అలర్ట్.. యాత్ర నిలిపివేత

by Yella Dhawani Reddy |

ఉత్తర భారతాన్ని వరుణుడు వదలటం లేదు.

అమర్‌నాథ్ భక్తులకు అలర్ట్.. యాత్ర నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర భారతాన్ని వరుణుడు వదలటం లేదు.గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక రోడ్లు మూసుకుపోయాయి. విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం (జులై 30) పహల్గాం, బల్తాల్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.

Next Story