- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా కీలక ప్రకటన.. ఆ ప్రాంతాలకు సర్వీసుల నిలిపివేత

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు రాష్ట్రాలకు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం ఇండియా -పాక్ బార్డర్ (India -Pak Border) లో యుద్ద వాతావరణం నెలకొంది. పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలను భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. భారత సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ చేస్తున్న డ్రోన్ దాడులను భారత ఆర్మీ (Indian Army) తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ -పాక్ సరిహద్దు ప్రాంతాలైన జమ్ము, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్ సర్, చంఢీగఢ్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్ కు నడిచే సర్వీసులను రద్దు చేసింది. ఈ నిలిపివేత ఈ నెల 15 వరకు కొనసాగుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది.