ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా కీలక ప్రకటన.. ఆ ప్రాంతాలకు సర్వీసుల నిలిపివేత

by Ramesh Goud |   ( Updated:2025-05-09 16:51:17.0  )
ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా కీలక ప్రకటన.. ఆ ప్రాంతాలకు సర్వీసుల నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు రాష్ట్రాలకు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం ఇండియా -పాక్ బార్డర్ (India -Pak Border) లో యుద్ద వాతావరణం నెలకొంది. పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలను భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. భారత సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ చేస్తున్న డ్రోన్ దాడులను భారత ఆర్మీ (Indian Army) తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ -పాక్ సరిహద్దు ప్రాంతాలైన జమ్ము, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్ సర్, చంఢీగఢ్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్ కు నడిచే సర్వీసులను రద్దు చేసింది. ఈ నిలిపివేత ఈ నెల 15 వరకు కొనసాగుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది.



Next Story

Most Viewed