‘నాలుగు విడతల’ తర్వాత బీజేపీ గెలుపు అవకాశాలు సున్నా : అఖిలేష్

by Dishanational6 |
‘నాలుగు విడతల’ తర్వాత బీజేపీ గెలుపు అవకాశాలు సున్నా : అఖిలేష్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీకి ఎన్నికల్లో వచ్చే సీట్ల గురించి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు దశల ఎన్నికల తర్వాత బీజేపీ 400 సీట్ల నినాదం నుంచి నాలుగు మాయమైందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుకు సున్నా మాత్రమే మిగిలిందన్నారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి ఉన్న అవకాశాలు శూన్యం అని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బీజేపీపై విరుచుకు పడ్డారు అఖిలేష్ యాదవ్.

మిగితా మూడు దశల్లోనూ బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. మరింత ఉత్సాహంతో ప్రజలు ఇండియా కూటమికి ఓటు వేస్తారని అన్నారు. బీజేపీని ఓడించి ఇండియా కూటమిని గెలిపించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ముందుకొస్తున్నారని తెలిపారు. జూన్ 1న జరిగే చివరి దశ పోలింగ్ వరకు ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని అన్నారు. ఇండియా కూటమి గెలవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు.

Next Story

Most Viewed