- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Manish Sisodia: మళ్లీ ఆస్పత్రిలో చేరిన సిసోడియా భార్య..
by Disha Web Desk 13 |
X
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా మళ్లీ ఆస్పత్రి పాలయ్యారు. నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న 49 ఏళ్ల సీమా గత కొన్ని వారాల్లో ఆస్పత్రిలో చేరడం ఇది మూడోసారి. సీమా సిసోడియాకు సోకిన మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి కారణంగా ఆమె మెదడు, వెన్నుపాము పనితీరు దెబ్బతింటుంది. ఈ వ్యాధి తిమ్మిరి, శరీరంలో జలదరింపు, మెడ కదలించడంలో ఇబ్బంది, విద్యుత్ షాక్ వంటి అనుభూతులను కలిగిస్తుంది.
బాధితులకు శరీరంపై నియంత్రణ, సమన్వయం కొరవడుతుంది. అస్థిరమైన నడక, ఏదైనా వస్తువు రెండుగా కనబడటం, అలసట, మాట్లాడటంలో ఇబ్బంది, ప్రేగు, మూత్రాశయ సమస్యలతో ఇబ్బంది పడతారు. సిసోడియా కుమారుడు విదేశాల్లో చదువుతున్నాడు. సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. దీంతో సీమా సిసోడియాకు సహాయంగా ఎవరూ లేరు.
Next Story