ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

by Prasad Jukanti |   (  Updated:2026-03-18 09:28:00  IST  )

ఢిల్లీలోని పాలం ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం రేఖా గుప్తా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం (Delhi Fire Accident) సంభవించింది. పాలం ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎక్స్ వేదికగా స్పందిస్తూ పాలంలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో జరిగిన దురదృష్టకరం అని ఈ ఘటనతో తాను తీవ్రంగా కలత చెందానని పోస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు

ఈవీ వాహనానికి ఛార్జింగ్ పెట్టి పడుకున్న కుటుంబం.. తెల్లారేసరికి ఏడుగురు సజీవదహనం

Next Story