ఊర్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్న శవం!

by Disha Web Desk 2 |
ఊర్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్న శవం!
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని సార్లు ప్రకృతికే అంతుచిక్కని సంఘటనలు సమాజంలో అనేకం జరుగుతుంటాయి. చనిపోయిన మనుషులు కూడా బతికిన ఇన్సిండెంట్‌లు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా.. సరిగ్గా ఇలాంటి ఘటనే దేశంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలో దర్శన్‌ సింగ్‌(80) అనే వ్యక్తి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. దాదాపు వారంరోజులుగా ఐసీయూలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

ఇదే విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులతో చెప్పారు. దీంతో బంధువులు గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఆసుపత్రి నుంచి శవాన్ని అంబులెన్సులో గ్రామానికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో అంబులెన్సు ఓ గుంతలో పడింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మరణించిన దర్శన్‌సింగ్‌లో కదలిక వచ్చినట్లు సమాచారం. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు మరోసారి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed