మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌(Madyapradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువు(Pond)లోకి ఒక్కసారిగా ట్రాక్టర్(Tractor) దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఖండ్వా(Khandwa)లో దుర్గమ్మ విగ్రహం నిమజ్జనం(Durga idol Immersion) చేసి తిరిగి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పింది. కన్ను మూసి తెరిచే‌లోపే చెరువులోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 10 నీటిలో మునిగిపోయారు. నీళ్లలో ఊపిరాడక 10 మంది మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. చెరువులో నుంచి ట్రాక్టర్‌ను బయటకు తీశారు. 10 మంది మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Next Story