- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఎంసీ చరిత్రలో అరుదైన ఘట్టం.. తొలి మహిళా కమిషనర్గా అశ్వినీ భిడే
ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తొలి మహిళా కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి అశ్విని భిడే నియమితులయ్యారు.

దిశ, వెబ్డెస్క్: బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి అశ్విని భిడే (Ashwini Bhide) ముంబై మున్సిపల్ కమిషనర్గా నియమితులయ్యారు. ఈ పదవిని అధిష్టించిన తొలి మహిళా అధికారిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుత కమిషనర్ భూషణ్ గగ్రాని (Bhushan Gagrani) నేటితో పదవీ విరమణ పొందుతుండటంతో, ఆయన స్థానంలో అశ్విని భిడే బాధ్యతలు స్వీకరించారు.
అయితే, ముంబైలో అత్యంత సంక్లిష్టమైన మెట్రో-3 ప్రాజెక్టును విజయవంతంగా నడిపించినందుకు గానూ ఆమె ‘మెట్రో ఉమెన్’గా గుర్తింపు పొందారు. 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన అశ్విని భిడే, గతంలో సీఎం కార్యాలయం (CMO)లో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా బీఎంసీలో అదనపు కమిషనర్గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ముఖ్యంగా ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్టు అమలులో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రష్మీ శుక్లాను రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా, సుజాత సౌనిక్ను తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమించి మహిళా సాధికారతకు పెద్దపీట వేయగా, ఇప్పుడు అశ్విని భిడే నియామకంతో బీఎంసీకి కూడా తొలి మహిళా సారథి లభించింది. 2030 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.






