తుపాకీతో ఏడుగురిని కాల్చి చంపిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Disha Web Desk 6 |
తుపాకీతో ఏడుగురిని కాల్చి చంపిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్: గేమ్స్‌లో గెలవడం.. ఓడిపోవడం సహజం, కానీ కొంద మంది ఓటమిని సహించలేరు. తాను గెలవలేన్న కోపంలో దారుణాలకు పాల్పడుతున్నారు. ఓటమి తెచ్చిన ఆగ్రహంలో ఊగిపోతూ ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అతడిని చూసి నవ్వారని ఏడుగురిని తుపాకీతో కాల్చి చంపేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. బ్రెజిల్‌లో ఒలివెయిరా అనే వ్యక్తి పూల్ గేమ్ ఆడుతూ ఒక వ్యక్తి చేతిలో ఓడిపోయాడు. తన వెంట వచ్చిన ఇజెక్వియాస్ అనే వ్యక్తితో మళ్లీ ఆడాలని ఫిక్స్ అయ్యి అతడిని ఇంకో గేమ్ ఆడాలని కోరాడు. ఇద్దరు కలిసి ఆడారు. రెండో గేమ్‌లోనే ఒలివెయిరా ఓడిపోయి 778 డాలర్లు పోగొట్టుకున్నాడు. దీంతో అక్కడున్న వారందరూ నవ్వారు. అది చూసిన ఒలివెయిరా కోపంతో ఊగిపోతూ పూల్ యజమానితో సహా అక్కడున్న ఏడుగురిని తుపాకీతో కాల్చి చంపేశాడు. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఆ తర్వాత అతడి స్నేహితుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story