ఈయన చేసిన పనికి ఛీ ఛీ అనడం ఖాయం.. ఇంతకు ఏం చేశాడో తెలుసా?(వీడియో)

by Dishafeatures2 |
ఈయన చేసిన పనికి ఛీ ఛీ అనడం ఖాయం.. ఇంతకు ఏం చేశాడో తెలుసా?(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి చేసిన పనికి మీరు ఖచ్చితంగా ఛీ ఛీ అంటారు. అతడు దగ్గర ఉంటే కోపంతో అతడిని కొట్టడం ఖాయం. ఇంతకు విషయం ఏంటంటే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన సమీర్ మియాన్ అనే ఓ వ్యక్తి కొబ్బరిబొండాలు అమ్ముతుంటాడు. అయితే ఎండలు మండుతుండటంతో కొబ్బరికాయలను తాజాగా ఉంచడానికి అతడు పక్కనే ఉన్న మురికికాలువలో నుంచి నీళ్లు తెచ్చి ఆ బొండాలపై చల్లాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ వ్యక్తిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఎండ దెబ్బను తట్టుకోవడానికి కొబ్బరి బొండాలను తాగడానికి వచ్చేవాళ్లకు ఇలాంటి బొండాలు అమ్ముతావా అంటూ మండిపడుతున్నారు. డబ్బు కోసం ఇలాంటి నీచానికి ఒడిగడుతావా అంటూ మరికొందరూ విమర్శిస్తున్నారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Next Story