- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్, సౌదీ అరేబియా మధ్య కీలక ఒప్పందం
2024లో హజ్ యాత్ర కోసం భారత్కు1,75,025 మంది యాత్రికుల కోటాను సౌదీ అరేబియా కేటాయించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, సౌదీ అరేబియా మధ్య కీలక ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది. 2024లో హజ్ యాత్ర కోసం భారత్కు1,75,025 మంది యాత్రికుల కోటాను సౌదీ అరేబియా కేటాయించింది. అంతేగాక హజ్ కమిటీ ద్వారా 1,40,020 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీ ధరన్, సౌదీ అరేబియా మంత్రి డాక్టర్ తౌఫిక్ బిన్ ఫౌజాన్లు హజ్ ఒప్పందం 2024పై సంతకం చేశారు. దీని ద్వారా ఈ ఏడాది హజ్ తీర్థయాత్ర చేపట్టాలనుకునే సాధారణ యాత్రికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అలాగే మరో 35,005 మంది యాత్రికులు హజ్ గ్రూప్ ఆపరేటర్ల ద్వారా వెళ్లేందుకు అనుమతించారు. ‘భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక హజ్ ఒప్పందం అధికారికంగా ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను’ అని స్మృతీ ఇరానీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
Next Story






