పాపం.. చెయ్యని తప్పుకు 43 ఏళ్ల జైలు

by Muthe.Rajitha |

ఎలాంటి నేరం చేయకపోయినా ఓ వ్యక్తి 43 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు.

పాపం.. చెయ్యని తప్పుకు 43 ఏళ్ల జైలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎలాంటి నేరం చేయకపోయినా ఓ వ్యక్తి 43 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. వందమంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు’ అని చట్టాలు చెబుతుంటాయి. కానీ USలోని భారత సంతతి వ్యక్తి సుబ్రహ్మణ్యం వేదం.. చేయని తప్పుకు 4 దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించారు. 1980లో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుపాలయ్యారు సుబ్రహ్మణ్యం. ఆ హత్య కేసులో అతని ప్రమేయం లేదని ఆయన ఇటీవలే నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు. అయితే అలా విడుదలైన వెంటనే దశాబ్దాల పాత డ్రగ్స్ కేసులో ఇమిగ్రేషన్ అధికారులు మళ్లీ ఆయన్ను అరెస్ట్ చేయడంతో కోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేసును నిలిపివేసి సుబ్రహ్మణ్యంకు తాత్కాలిక ఊరటనిచ్చింది.

Next Story