- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూ కాశ్మీర్లో వరుసగా3 భూకంపాలు
మంగళవారం 5.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను వణికించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్డెస్క్: మంగళవారం 5.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను వణికించిన విషయం తెలిసిందే. కాగా బుధవారం తెల్లవారుజామున మరోసారి జమ్మూ, కాశ్మీర్లో మరో మూడు భూకంపాలు నమోదయ్యాయి. J&K యొక్క కట్రా లో తెల్లవారుజామున 2:20 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉదయం 7:56 గంటలకు 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే 3.3 తీవ్రతతో భూకంపం J&K కిష్త్వార్లో ఉదయం 8.29 గంటలకు సంభవించింది. వరుస భూకంపాలు రావడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొండ ప్రాంత ప్రజలు ఇంటినుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది.
Next Story






