ఢిల్లీలో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి

by Disha Web Desk 13 |
ఢిల్లీలో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి
X

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. రెండు వేర్వేరు ఘటనల్లో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఏరియాలో ఇది చోటు చేసుకుంది. శుక్రవారం రోజున ఆనంద్ తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా జుగ్గీ అటవీ ప్రాంత సమయంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

శరీరంపై కరిచిన గాయాల ఆధారంగా వీధి కుక్కలు ఇతర జంతువులు దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆదిత్య అనే చిన్నారి వీధి కుక్కల దాడిలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Next Story

Most Viewed