దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్‌జీటీ నోటీసులు

by  |
దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్‌జీటీ నోటీసులు
X

దిశ, నల్లగొండ: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్‌జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్) షాకిచ్చింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని చౌటుప్పల్‌కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి ఎన్టీజీని ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్‌జీటీ చెన్నై బెంచ్ నోటీసులిచ్చింది. అందులో భాగంగానే కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. దీనికితోడు చౌటుప్పల్‌లో ఫార్మా కాలుష్యంపై విచారణ జరిపేందుకు ఎన్జీటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా వ్యవహరాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్లను నియమించింది. ఈ కమిటీ చౌటుప్పల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరించి కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని ఎన్జీటీ పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.



Next Story

Most Viewed