జగన్ సర్కార్‌‌ను తిట్టిన.. డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి

by  |
జగన్ సర్కార్‌‌ను తిట్టిన.. డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని.. అధికారులపై తీవ్ర విమర్శలు చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్(52) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గతేడాది కరోనా రోగులకు సేవలు అందించిన సందర్భంగా.. తమకు కనీస సౌకర్యాలు లేవని మీడియా ముందుకు తమను బాధను వెల్లడించారు డాక్టర్ సుధాకర్. దీంతో ప్రభుత్వం సుధాకర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి సుధాకర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. అయితే, సస్పెండ్ అనంతరం.. పోలీసులు నడిరోడ్డుపై ఆయనను చిత్రహింసలకు గురిచేసిన వీడియోలు గతేడాది వైరల్ అయ్యాయి. సుధాకర్ మానసిక స్థితి బాగాలేదంటూ విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స కూడా అందించారు.



Next Story

Most Viewed