వైసీపీ ప్రభుత్వానికి లోకేష్ హెచ్చరిక

by  |
వైసీపీ ప్రభుత్వానికి లోకేష్ హెచ్చరిక
X

దిశ, ఏపీబ్యూరో: తుపానుకు నష్టపోయిన కౌలు రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ డిమాండ్​ చేశారు. శనివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగానే ఈతేరు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ ​మాట్లాడుతూ.. గ్రామాల్లో సెంటు భూమి లేని ఎస్సీ, బీసీలే కౌలు రైతులుగా ఉన్నారని చెప్పారు. కనీసం వాళ్లకు సీసీఆర్​సీ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శలు చేశారు. రైతులకు సాయం చేయకపోగా మోటార్లకు మీటర్లు పెడితే సహించేది లేదని.. తామే మీటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed