జగన్ శాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికింది : లోకేశ్

by  |
జగన్ శాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికింది : లోకేశ్
X

దిశ, ఏపీబ్యూరో: పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుంటూ, గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కారుకు, ఇక్కడి నుంచి పోతున్న డబ్బులను మాత్రం పట్టుకునే దమ్ము లేకపోయిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. “వైఎస్ జగన్ శాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికిపోయిందని.. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో రూ .5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతుంది” అని విమర్శనాస్త్రాలు సంధించారు. మరో ట్వీట్‌లో “ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?” అని నారా లోకేశ్ ప్రశ్నించారు.


Next Story

Most Viewed