క్రిస్టియన్‌ సీఎంకు ఎందుకంత కోపం: నారా లోకేశ్

by  |
క్రిస్టియన్‌ సీఎంకు ఎందుకంత కోపం: నారా లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నాయకులు నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘ధర్మాన్ని కాపాడమంటే క్రిస్టియన్ సీఎం జగన్‌కి ఎందుకంత కోపం? అన్ని మతాలను సమానంగా చూడమని అడిగితే ఎందుకంత అసహనం? టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మ పరిరక్షణ యాత్రకి నిన్న ఇచ్చిన అనుమతి ఈ రోజు ఎందుకు రద్దయ్యింది? దేవాలయాలపై దాడులు, దళితుల పై దమనకాండ, అన్నదాతల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ చేపడుతున్న ధర్మ పరిరక్షణ యాత్రకి జగన్ రెడ్డి మతం రంగు ఎందుకు పూస్తున్నారు? ధర్మాన్ని కాపాడమని అడిగినందుకు టిడిపి నేతల అక్రమ నిర్బంధం, కార్యకర్తల పై లాఠీ ఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్ని కుట్రలు చేసినా ధర్మ పరిరక్షణ కోసం టిడిపి పోరాటం ఆగదు. అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed