జ‌నాన్ని మోసం చేసే రెడ్డి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి: నారా లోకేశ్

by  |
జ‌నాన్ని మోసం చేసే రెడ్డి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి: నారా లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై టీడీపీ లీడర్‌ నారా లోకేశ్ విమర్శలు చేశారు. తాజాగా ట్విట్టర్‌ వేదికగా.. ‘జ‌నాన్ని మోసం చేసే రెడ్డి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి రాష్ట్రాన్ని ద‌గా చేశారు. 25 మంది ఎంపీలని ఇస్తే కేంద్రం మెడ‌లు వంచి మ‌రీ ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని ఉత్త‌ర‌కుమార ప్ర‌గ‌ల్భాలు ప‌లికి.. చివరికి తన 31 కేసుల నుంచి త‌ప్పిస్తే చాలు.. ప్ర‌త్యేక హోదా ఊసెత్త‌న‌ని 28 ఎంపీల్ని కేంద్రానికి తాక‌ట్టు పెట్టారు. విభ‌జ‌న‌చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి రావాల్సిన హామీల‌కు బాబాయ్ హ‌త్య కేసుతో చెల్లు చేసింది కేంద్రం. బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌క్క‌ర్లేదు కానీ, సహనిందితులైన అధికారులను త‌న‌కు కేటాయిస్తే చాల‌ని.. కేంద్రం వ‌ద్ద సాగిల‌ప‌డ్డారు జగన్. అప్పులు వాడుకోవ‌డానికి అనుమ‌తిస్తే చాలు.. ఏ ప్రాజెక్టులివ్వ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌ని ఒప్పందం చేసుకున్నారు. బ‌డ్జెట్‌లో ఏపీకి ఏమీ ఇవ్వ‌ని కేంద్రాన్ని ఏమీ అన‌లేని నిస్స‌హాయ‌స్థితిలో వున్నారు జగన్ రెడ్డి. అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed