మీ గాలి మాటలతో పండుగ రాదు: నారా లోకేశ్

by  |
మీ గాలి మాటలతో పండుగ రాదు: నారా లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌లో కామెంట్ పెట్టారు. ‘సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అంటూ వైఎస్ జగన్ పబ్లిసిటీ పిచ్చి తప్ప రైతుల ఇంట పండుగ వాతావరణం లేదు. వరదలు, తుఫాన్ల దెబ్బకి దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరకొరగా పండిన పంటని అమ్మి రెండు నెలలు అవుతున్నా ధాన్యం బకాయిలు విడుదలకాక రైతులు కంట కన్నీరు పెట్టి రోడ్డెక్కి ఆందోళన చెయ్యాల్సిన దయనీయ పరిస్థితి. నిండా మునిగిన కౌలు రైతులు కనీస సహాయం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీ గాలి మాటలతో రైతుల ఇంట పండుగ వాతావరణం రాదు. ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.2788 కోట్లను వెంటనే రైతులకు చెల్లించండి జగన్ రెడ్డి గారు.’ అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.


Next Story