మరి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి: లోకేశ్

by  |
మరి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి: లోకేశ్
X

దిశ,వెబ్‌డెస్క్: పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడంలో సీఎం జగన్ విఫలమయ్యారని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండ‌పాలెం నియోజకవర్గంలో టీడీపీ నేత నారా లోకేశ్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…అకాల వర్షాల వల్ల 10వేల కోట్ల పంట నష్టం జరిగిందని అన్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రైతుల ఆవేదన తెలుసుకోకుండా రూ.61వేల కోట్లు ఇచ్చామని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. రైతులు ఆనందంగా ఉంటే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

Next Story

Most Viewed