‘లాక్‌డౌన్‌ సమయంలో కక్ష సాధిస్తున్నారు’

by  |
‘లాక్‌డౌన్‌ సమయంలో కక్ష సాధిస్తున్నారు’
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాపై యుద్ధానికి కావాల్సిన సన్నద్ధత కోసం లాక్ డౌన్ సమయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటే జగన్ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు, ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టుల్లో బిజీగా ఉందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. దాని పర్యవసానమే ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు వదలడం, రోడ్ల మీద చనిపోవడం అంటూ ట్వీట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

క్వారంటైన్ సెంటర్లలో అధ్వానమైన వసతులు, పీపీఈ కిట్లు లేవంటూ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆందోళనకి దిగటం దారుణమన్నారు. గంటకో సంఘటన వెలుగు చూస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం ఘోరం అంటూ మండిపడ్డారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో కరోనాతో ఓ మహిళ మృతి చెందితే.. ఆ మృతదేహాన్ని ఆస్పత్రి బెడ్ మీదే కొన్ని గంటల పాటు వదిలేశారని విమర్శించారు.


Next Story

Most Viewed