‘యథా ముఖ్యమంత్రి.. తథా వాలంటీర్లు’

by  |
‘యథా ముఖ్యమంత్రి.. తథా వాలంటీర్లు’
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలోని ఓ గ్రామ వాలంటీర్ చేతివాటం ప్రదర్శించాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. సీఎం చేయూత పథకం కింద వచ్చిన నగదులో నుంచి రూ. 2 వేలు కమీషన్ తీసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్‌ పై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘యథా ముఖ్యమంత్రి, తథా వాలంటీర్లు. ఆయన లక్షల కోట్లు స్కాంలు చేస్తుంటే… వీళ్లు వేలల్లో చేతివాటం స్కీమ్ లో కొట్టేస్తున్నారు. అంటూ విమర్శించారు.



Next Story

Most Viewed