మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలయ్య

by  |
balakrishna son
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరు పండగ చేసుకొనే వార్త చెప్పారు. తన కొడుకు త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడని ప్రకటించాడు. అప్పుడెప్పుడో 2017 లో తన కొడుకు మోక్షంగా త్వరలోనే తెరంగేట్రం చేస్తున్నాడని చెప్పి అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు. ఇక ఆ తర్వాత మోక్షజ్ఞ ఊసే ఎత్తలేదు. ఇక అప్పటినుండి ఎప్పుడు ఏ స్టార్ హీరో లాంచ్ అవుతున్నా.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇక మద్యంలో అసలు మోక్షజ్ఞ కు సినిమాల మీద ఆసక్తి లేదని, వేరే వ్యాపారంలో అడుగుపెడుతున్నదని వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక అలాంటి వార్తలకు చెక్ పెడుతూ బాలయ్య తన పుట్టిన రోజు నాడు తన కొడుకు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు.

తన 61వ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఆదిత్య 369 సీక్వెల్‌లో అబ్బాయి, నేను కలిసి నటిస్తాం. ‘తాతమ్మ కల’ వంటి పలు సినిమాల ద్వారా నాన్నగారు నాకు నటనలో మెళకువలు నేర్పించాడు. అలా నేను మోక్షజ్ఞను నా సినిమాతో పరిచయం చేస్తూ మెళకువలు నేర్పిస్తాను. ఈ సినిమాకు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్టు కూడా పూర్తి చేశారు. దానికి స్టోరీ బోర్డ్ సైతం రెడీ చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతోందని” తెలిపారు. ఇక ఈ సినిమాకు బాలయ్యే అన్ని దగ్గరుండి చూసుకొంటున్నాడు. మాటలు, స్క్రీన్ ప్లే బాలయ్య పర్యవేక్షించడం విశేషం. ఏదిఏమైనా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నటసింహం నట వారసుడు ఎట్టకేలకు తన మొదటి సినిమాను తండ్రి తోనే కలిసి నటించడమంటే గొప్ప విషయమే.. ఇక ఒకేసారి వెండితెరపై బాలయ్యబాబును , మోక్షజ్ఞను చూసిన ఫ్యాన్స్ కి పూనకాలే..


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story