- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని విశాఖ ఏజెన్సీలో స్మగ్లర్లు రెచ్చిపోయారు. మన్యం నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు అధికంగా గంజాయి సరఫరా జరుగుతున్నట్టు గుర్తించిన నల్గొండ పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించారు. బోర్డర్ దాటిన పోలీసుల రాకను ముందుగానే గుర్తించిన స్మగర్లు వారిపై రాళ్లతో దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది.
దీంతో ఏజెన్సీలోని కోయ్యూరు మండలం తులబాయి గడ్డ వద్ద పోలీసులకు, గంజాయి స్మగ్లర్లకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ కాల్పుల్లో కొంత మంది స్మగ్లర్లకు తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. దీంతో క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా హాస్పటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నర్సీపట్నం పోలీసులు తెలిపారు. కాగా, కాల్పులు చోటుచేసుకున్న విషయాన్ని జిల్లా ఎస్పీ రంగనాధ్ ధ్రువీకరించారు. పరారీలో ఉన్న గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నట్టు నల్గొండ పోలీసులు తెలిపారు.