అమెరికాలో నల్లగొండ వాసి మృతి..

by  |
అమెరికాలో నల్లగొండ వాసి మృతి..
X

దిశ, నల్లగొండ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా వాసి మృతిచెందాడు. ఈ ఘటన ఈనెల 19న జరగగా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుర్రంపోడు మండలం తేరటిగూడెం గ్రామానికి చెందిన మండలి శేఖర్(28) రెండేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లారు.

తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఎల్లికాట్ సిటీలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఈ ప్రమాదం జరిగి మూడు రోజులైనా నేటికీ మృతదేహం స్వగ్రామానికి చేరుకోలేదు. మండలి శేఖర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబీకులు, గ్రామస్థులు వేడుకుంటున్నారు.


Next Story

Most Viewed