దివంగత నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత

by  |
దివంగత నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య (68) కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావడంతో నాయినితో పాటు అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమె‌ అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో అహల్యకు చికిత్స అందిస్తున్నారు. భర్త నాయిని నర్సింహారెడ్డి ఆఖరి చూపునకు కూడా ఆమెను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తీసుకువచ్చి మళ్లీ ఆస్పత్రికే తరలించారు. ఇదేక్రమంలో చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో పరిస్థితి విషమించి చనిపోయారు.

Next Story

Most Viewed