అభివృద్ధి పనులు వేగంగా సాగాలి

by  |
అభివృద్ధి పనులు వేగంగా సాగాలి
X

దిశ, అచ్చంపేట: అధికారులు గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండల పరిధిలో గల మన్ననూర్ ఎల్లంపల్లి, అమ్రాబాద్ తదితర గ్రామాల్లో చేపడుతున్న వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే హరితహారం ద్వారా గ్రామాల్లో నాటే ప్రతి మొక్కకూ లెక్క పక్కగా ఉండాలని, ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే, అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌తో పాటు ఎంపీడీవో శంకర్ నాయక్, సర్పంచులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.



Next Story