ప్రివిలేజ్ కమిటీలో కన్నీళ్లు పెట్టుకున్న రోజా..

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన కమిటీ ఈ మీటింగ్‌లో తన సమస్యలను ఎమ్మెల్యే రోజా వివరించే ప్రయత్నం చేశారు. నియోజక వర్గంలో జరిగే అభివద్ధి పనులతో పాటు ఏ కార్యక్రమానికి తనను పిలువడం లేదని.. మొన్న జరిగిన ఇళ్ల [&hellip;]</p>

MLA Roja
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన కమిటీ ఈ మీటింగ్‌లో తన సమస్యలను ఎమ్మెల్యే రోజా వివరించే ప్రయత్నం చేశారు.

నియోజక వర్గంలో జరిగే అభివద్ధి పనులతో పాటు ఏ కార్యక్రమానికి తనను పిలువడం లేదని.. మొన్న జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కూడా తనను ఉద్దేశ్యపూర్వంగానే పిలువ లేదని కన్నీటి పర్యంతమయ్యారు. నగరిలో తనకు ఎదురయ్యే సమస్యలన్నింటినీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డికి ఫిర్యాదు రూపంలో రోజా వివరించారు. దీనిపై స్పందించిన చైర్మన్ సీఎం జగన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Next Story