వరద బాధితులకు మైహోమ్ గ్రూప్‌ భారీ విరాళం

by  |
వరద బాధితులకు మైహోమ్ గ్రూప్‌ భారీ విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మై హోం గ్రూప్ ముందుకు వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటన చేసింది. వరద ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మై హోమ్ సంస్థ హామీ ఇచ్చింది. అటు సీఎస్ఆర్ డెవలపర్స్ కూడా రూ.10లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు చెక్కును మంత్రి కేటీఆర్‌కు సంస్థ ఎండీ చెరుకు సుధాకర్‌రెడ్డి అందజేశారు.

Next Story