ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : ఎమ్మెల్యే రేగా కాంతారావు

by Sridhar Babu |
ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : ఎమ్మెల్యే రేగా కాంతారావు
X

దిశ, అశ్వాపురం: ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం రాత్రి ఆయన మండలంలోని రామచంద్రపురం, నెల్లిపాక బంజర గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని కార్యకర్తలతో సందడి చేశారు. అనంతరం మల్లెలమడుగు గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త రేసు సంజీవరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరగడంతో ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దిశ ప్రతినిధి‌తో చిట్ చాట్‌లో కొన్ని విషయాలు వెల్లడించారు. ప్రజలకు, కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు 50 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసి నేరుగా ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తానన్నారు. ఇదే సమయంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరెందర్, ఎంపీపీ ముత్తినేని సుజాత, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, టీ‌ఆర్ఎస్ మండల కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.



Next Story