మస్తు పిరమైన మటన్..

by  |
మస్తు పిరమైన మటన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగ వేళ మాంసం ధరలు కొండెక్కాయి. రెగ్యూలర్‌గా మటన్ కేజీ 500 నుంచి 600 మధ్యలో ఉండగా.. ప్రస్తుతం కేజీ మటన్ 800 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాంసం ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందనే వరుస కథనాలు వెలువడిన నేపథ్యంలో మటన్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో వ్యాపారులు ధరలు పెంచినట్లు అంతా భావిస్తున్నారు. ఏదెమైనా పండుగ కావడంతో ధరలు పెరిగినా కూడా మాంసం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సైతం వెనుకాడటం లేదని తెలుస్తోంది.

Next Story

Most Viewed