ముత్తిరెడ్డిపై అసత్య ప్రచారాలు మానుకోవాలి

by  |
ముత్తిరెడ్డిపై అసత్య ప్రచారాలు మానుకోవాలి
X

దిశ, మెదక్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై వాట్సాప్ గ్రూపులో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీసులకు మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మరాజురెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు గిట్టని వ్యక్తులు కావాలనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ముత్తిరెడ్డిపై అసత్య ప్రచారాలు మానూకోవాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మంగోలు చంటి , సతీష్ గౌడ్ , కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ అమర్ గౌడ్ , ఆకుల రాజేష్ గౌడ్ ఉన్నారు.

Next Story

Most Viewed